telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి దుర్మరణం

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం మేడూరుకు చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు పయనమైంది. వారు ప్రయాణిస్తున్న కారు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద అదుపు తప్పి పాల ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన అనురాధ, సుప్రియలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులను డ్రైవర్ సాంబారెడ్డి (44), పాండురంగారావు(42), నరసింహారావు(40), సత్యసాగర్‌ (10)లుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు.

Related posts