హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగబోయే ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయన శనివారం బీజేపీ నాయకులతో కలిసి హుజురాబాద్లోని వెంకటసాయి గార్డెన్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఇక్కడ ముందుగా రాజేందరే మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో రేపు ఎగురబోయేది గులాబీ జెండా మాత్రమే అంటూ తన స్వీచ్ ఆరంభించారు. ఆ వెంటనే కాషాయం కండువా కప్పుకున్న విషయం గుర్తుకు వచ్చి నాలుక కరుచుకున్నారు. తాను చెప్పిన విషయాన్ని సవరించుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆయన షాక్ గురైనట్టుగా కనిపించింది. ఈటల ఎంత సవరించుకున్నా ప్రజలు మాత్రం అతని మనసులోని మాటనే బయటకు వచ్చిందని అంటున్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఈటల చెప్పడంలో పెద్ద అశ్చర్యం లేదని, ఆ విషయం అతనికి తెలుసు కాబట్టే గుండెల్లో నుంచి వచ్చిందంటున్నారు.
previous post
చంద్రబాబుకు పవన్ పార్ట్నర్: వైఎస్ జగన్