telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి 120 బెడ్స్ డొనేట్ చేసిన యువరాజ్‌

కరోనా మహమ్మారి ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్.. ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత తీర్చేందుకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా తన ఫౌండేషన్‌ (YouWeCan Foundation) ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో 120 ఐసీయూ బెడ్స్‌కు సాయం అందించాడు.

ఈ ఐసీయూ బెడ్లను యువీ నేడు వర్చువల్‌గా ప్రారంభించాడు. కాగా ఈ సిక్సర్ల వీరుడు గతంలో కూడా ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. ఈ ఏడాది మే నెలలో తన ఫౌండేషన్‌ పేరిట మధ్యప్రదేశలోని ఇండోర్‌లో మూడున్నర కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ఇచ్చాడు.

Related posts