telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రాష్ట్ర ఆదాయం తగ్గింది : మంత్రి హరీశ్ రావు

43వ జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీష్‌రావు మాట్లాడుతూ.. న్యూట్రల్ ఆల్కహాల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాద‌న్నారు.. జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి ఎక్సైజ్, పెట్రోల్ అండ్ డీజిల్ మాత్రమేన‌ని.. కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోంది సెస్, సర్ ఛార్జిల రూపంలోనే అన్నారు హ‌రీష్‌రావు.. గ‌త బ‌డ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూలో 18 శాతం సర్ ఛార్జి, సెస్‌ల రూపంలో వస్తోంది. 22.17 లక్ష కోట్ల బడ్జెట్‌లో 3.99 లక్షల కోట్ల ఆదాయం సెస్, సర్వీస్ ఛార్జీల ద్వారా సమకూరింద‌ని వెల్ల‌డించారు.. రాష్ట్రాలు 1.64 లక్షల కోట్లు అంటే 41 శాతం ఆదాయం కేంద్రం వసూలు చేస్తోన్న సెస్ లు , సర్ ఛార్జిల ద్వారా కోల్పోతున్నాయ‌ని.. తెలంగాణ రాష్ట్రం ప్రతీ ఏటా రూ.3439. కోట్లు అంటే 2.102 శాతం ఆదాయం కోల్పోతుంద‌న్నారు ఆర్థిక‌మంత్రి.. ఆల్కహాల్ ను అన్ని రాష్ట్రాల మంత్రులు కోరుతున్నట్లు జీఎస్టీ నుండి మినహాయించాల‌ని డిమాండ్ చేసిన ఆయ‌న‌.. జీఎస్టీలో‌ చేర్చితే రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయి.. జీఎస్టీ పరిధి నుండి శాశ్వతంగా న్యూట్రల్ ఆల్కహాల్ ను మినహాయించేలా నిర్ణయం తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Related posts