కడప జిల్లా పులివెందులలో మెడికల్ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఈ కళాశాలకు డిసెంబర్లో శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో పాడాపై జరిగిన రివ్యూ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు సూచన ప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది.
పులివెందుల నియోజకవర్గంలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పులివెందుల ఏరియా ఆసుపత్రికి, వేంపల్లి సీహెచ్సీకి రూ.30 కోట్లతో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. పాడా పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ రివ్యూలో జిల్లా కలెక్టర్ హరికిరణ్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, పాడా ఓఎస్టీ అనిల్కుమార్ రెడ్డి పాల్గొన్నారు.