బయోపిక్ల హవా సినీపరిశ్రమలో ఇంకా కొనసాగుతూనే ఉంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవిత నేపథ్యాలని వెండితెరపై చూపించి మంచి విజయాలు సాధిస్తున్నారు మేకర్స్. తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ జీవితంపై సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
లూలూ పార్టీ ఆర్జేడీ గుర్తు లాంతరు కావడంతో ఆయన సినిమాకి లాంతరు( లాల్టెన్) అనే పేరు పెట్టినట్టు తెలుస్తుంది. ప్రముఖ భోజ్పురి నటుడు యశ్ కుమార్ లాలూ పాత్రలో కనిపించనున్నాడు. లాలూ సతీమణి రబ్రీదేవి పాత్రలో స్మృతి సిన్హా నటించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తుంది.