telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆ ప్రకటనలను ఆపండి.. పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

mamatha benerji

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలుచేయబోమని ప్రకటన కూడా చేసేశాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఆందోళనను తీవ్రతరం చేసింది. ఈ చట్టాన్ని అమలు చేయబోమంటూ బెంగాల్ ప్రభుత్వం యాడ్స్ కూడా ఇస్తోంది.

ఈ నేపథ్యంలో వెంటనే ఈ యాడ్స్ నిలిపివేయాలని కోల్ కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుంటే, మరోవైపు మమత ప్రభుత్వం ఇలాంటి యాడ్స్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు… వెంటనే ప్రకటనలను ఆపేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Related posts