telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నా పేరుతో సెటిట్ మెంట్లు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టండి: విజయసాయి రెడ్డి

Vijayasai reddy ycp

నా పేరుతో ల్యాండ్ సెటిట్ మెంట్లు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టండని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోలీసులకు చెప్పారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత.. నా పేరును ఉపయోగించుకొని, వివాదాస్పద ఆస్తుల్లో నా భాగస్వామ్యం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు. నా పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడే యత్నాలు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందన్నారు.

ప్రాపర్టీ విషయంలోనూ నేను ఏ అధికారికి కూడా ఫోన్ చేసి పరిష్కరించాలని చెప్పిన దాఖలాలు లేవన్నారు. భవిష్యత్తులో కూడా నేను చెప్పను. చట్టప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రాపర్టీల వివాదాల విషయంలో నా జోక్యం ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.

విశాఖలో నాకు మూడు బెడ్ రూమ్ ల ఒక ఫ్లాట్ తప్ప ఎటువంటి ఆస్తులు లేవని చెప్పారు. నా పేరుతో గానీ, కుటుంబ సభ్యుల పేరుతో గానీ నాకు ఎటువంటి ఆస్తులులేవు. ఆస్తులు సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదు.. ఏ వివాదంలోనూ నేను తలదూర్చనని విచెప్పారు. నా పేరు మీద అక్రమాలకు పాల్పడుతోన్న వారిని అదుపులోకి తీసుకోండని కలెక్టర్ కు, పోలీసులకు విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Related posts