telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్‌ 2021 : ముంబైపై బెంగళూరు భారీ విజయం

ఐపీఎల్‌ 14 వ సీజన్‌ మొదటి మ్యాచ్‌లోనే కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టు దుమ్ములేపింది. డిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ జట్టు చుక్కలు చూపించింది ఆర్సీబీ. చివరి వరకు ఉత్కంఠ రేపి ఆఖరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్‌ మైదానంలో శుక్రవారం జరిగిన ఐపీఎల్‌-14 తొలి మ్యాచ్‌లో బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. మొదట ముంబయి 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఆ జట్టును “మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ” హర్షల్‌ పటేల్‌ {5-27} గట్టి ఎదురుదెబ్బ కొట్టాడు. ఇక క్రిస్‌ లిన్‌ 35 బంతుల్లో 49 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అటు ఛేజింగ్‌లో కెప్టెన్‌ కోహ్లీ 33 పరుగులు, మ్యాక్స్‌వెల్‌ 39 పరుగులు చేసి.. రాణించగా.. మిడిలాడర్‌లో 48 పరుగులు చేసి… డివిలియర్స్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ముంబయి జట్టులో బుమ్రా 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా.. జాన్సెన్‌ 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా.. స్టార్‌ బ్యాట్‌మెన్‌ ఏబీ సిక్స్‌ర్లు, పోర్లతో జట్టును విజయం ముంగిట నిలపడం బెంగళూరు ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నింపింది.

Related posts