telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కోన‌సీమ‌లో అల‌జ‌డిలు చంద్ర‌బాబు, ప‌వ‌న్ సృష్టిస్తున్నారు..- ఏపీ మంత్రి సంచలన కామెంట్స్..

*కోన‌సీమ‌లో అల‌జ‌డిలు చంద్ర‌బాబు , ప‌వ‌న్ సృష్టిస్తున్నారు..
*పక్కా ప్లాన్‌ ప్రకారమే విధ్వంసం సృష్టించారు
*చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు, వ్య‌వ‌స్థ‌ల‌పై గౌర‌వం లేదు..
*నిందితులెవరైనా వదిలేది లేదు..

కోనసీమ జిల్లాలో విధ్వంసకాండకు సంబంధించి లోతుగా విచారణ జరిపిస్తామని..నిందితులెవరైనా వదిలేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు.

బుధవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… అన్నిపార్టీల అంగీకారంతోనే జిల్లా పేరు మార్చారని తెలిపారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని… పక్కా ప్లాన్‌ ప్రకారమే విధ్వంసం సృష్టించార‌ని ఆరోపించారు..

పచ్చని కోనసీమలో చంద్రబాబు, పవన్‌ అలజడి  సృష్టించారని మంత్రి దాడిశెట్టి రాజా దుయ్యబట్టారు. నిరసన కారులు జై జనసేన, జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేశారని ఆరోపించారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ కి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తున్నారని దాడిశెట్టి రాజా అన్నారు

ఆనాడు తుని ఘటనకు చంద్రబాబే కారణమని.. ఇప్పుడు అమలాపురం ఘటనకు కూడా ఆయనే కారణమ‌ని అన్నారు.చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు,వ్యవస్థల‌పై గౌరవం లేదన్నారు.

 

Related posts