telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతులకు మార్కెటింగ్ శాఖ తోడ్పాటునివ్వాలి: సీఎం జగన్

cm jagan ycp

రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ తోడ్పాటునివ్వాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం కోసం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భాంగా మాట్లాడుతూ రైతులు తమ పంట నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజి నిర్మించాలని భావిస్తున్నామని తెలిపారు.

వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయాలని సూచించారు.రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ కు దన్నుగా నిలుస్తామని పేర్కొన్నారు.తన వద్ద పంట ఉందన్న విషయం రైతు ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం) అధికారులకు తెలిపితే ఆ విషయం వెంటనే సెంట్రల్ సర్వర్ కు చేరాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Related posts