టీడీపీ, జనసేన పార్టీల పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే టీడీపీ.. దేశంలో జతకట్టని పార్టీ లేదని విమర్శించారు. మోదీ మళ్ళీ ప్రధాని కానేకాడని జోస్యాలు చెప్పిన సిగ్గు లేని పచ్చ పార్టీ .. ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతోందని ఎద్దేవా చేశారు. మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేదే చంద్రబాబు ఫిలాసఫీ అని అన్నారు.
ప్యాకేజీ ఆర్టిస్ట్ (పవన్) చంద్రబాబు కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారని విజయసాయి విమర్శించారు. ఆయనేమో ఎందుకు ఓడిపోయామో తెలియదంటారని విమర్శించారు. రెండు చోట్ల అడ్రసు గల్లంతైన పార్ట్నరేమో.. కాలం కలిసొచ్చో, ఈవీఎంల చలవతోనే గెలిచారంటారని అన్నారు. 23 సీట్లలో ఆయనను, ఒకచోట పార్ట్నర్ను ఎవరు గెలిపించారని విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
పోలవరం దోపిడీకి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం: చంద్రబాబు