telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Tdp mlas suspension

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సభను పదేపదే అడ్డుకుంటున్నారన్న కారణంతో, ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెండ్ చేశారు. 

అసెంబ్లీ వ్యవహారాల మంత్రి తీర్మానం మేరకు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులపై వేటు పడింది. బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ను మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. 

Related posts