telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా విజృంభణ : ఢిల్లీలో లాక్ డౌన్

కరోనా విజృంభణ పెరుగుతున్న తరుణంలో ఢిల్లీ సిఎం ఆరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లో ఆరు రోజుల పాటు లాక్ డౌన్ ఉందనున్నట్లు సిఎం ఆరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని.. బెడ్స్ కూడా దొరికే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. రోజుకు వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు. ఈ లాక్ డౌన్ అందరూ సవాలుగా తీసుకొని.. ఇంట్లోనే ఉండి కరోనాను అరికట్టాలని సూచించారు. లాక్ డౌన్ ను పొడగించకుండా చూసుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

Related posts