టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేనాని పవన్ దత్తపుత్రుడనే విషయం అందరికీ తెలుసనివైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు పవన్ ఇచ్చిన కాల్షీట్లు ఇంకా అయిపోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్తు లేదని చంద్రబాబుకు అర్థమైందని అన్నారు.
అందుకే ప్యాకేజీ స్టార్ ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. టీడీపీ పని ఇక ఖాళీ అని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలో దిక్కుకు వెళుతుంటే చంద్రబాబుకు దిక్కుతోచడం లేదని చెప్పారు. ప్యాకేజీ స్టార్ ను రంగంలో దింపడం వెనుక మతలబు అదేనని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.