తెలంగాణలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటర్ ఫలితాల అవకతవకలకు నిరసనగా ఈరోజు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలు గాంధీ భవన్ వద్ద చేపట్టిన 48 గంటల నిరసన దీక్షకు రేవంత్ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం, ఇంటర్ బోర్డు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
20 ఏళ్లుగా పరీక్షను నిర్వహిస్తున్న సంస్థను తప్పించిన కేటీఆర్, తన బావమరిది స్నేహితుడి సంస్థ గ్లోబరినాకు టెండర్ ఇప్పించారని ఆరోపించారు. తెలంగాణ ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో ఇంతవరకూ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.కేటీఆర్ ఫ్రెండ్ మామ సంస్థ అయిన మాగ్నటిక్ ఇన్ఫోటెక్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.