telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

టీఆర్ఎస్ కి పోలీసులు తొత్తుగా మారారు…

పోలీసుల నిర్లక్ష్యం వల్లే వామనరావు దంపతుల హత్య జరిగింది. అధికార పార్టీకి పోలీసులు తొత్తుగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుంది అనిఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.పోలీస్ కమిషనర్ కు ఫోన్లు చేసినా పట్టించుకోక పోవడం హేయమైన చర్య అని చెప్పిన ఆయన ఈ ఘటన వెనుక ఉన్న అసలైన సూత్రధారులు బయటకు రావాలి అన్నారు. పుట్ట మధుకర్ మేనల్లుడి పుట్ట లింగమ్మ ట్రస్ట్ కార్యకలాపాలు నిలిపి వేసేందుకు కరణమయ్యాడనే హత్యకు పాల్పడ్డారు. పుట్టా మధుకర్ పాత్ర పై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ స్పందించింది. కేసులో బాధితులకు న్యాయం జరగాలంటే సీబీఐతో విచారణ చేయించాలి. తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన న్యాయవాదులను హత్య చేస్తున్నారు. వమనరావు దంపతుల హత్య వంగవీటి మోహన రంగ హత్య ను గుర్తుకు తెస్తోంది అని ఆయన తెలిపారు. ఆనాటి హత్య తెలుగుదేశం అంతానికి కారణం కాగా.. వామనరావు దంపతుల హత్య తెరాస అంతానికి నాంది గా భావిస్తున్నా… సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కేసు విచారణ జరగాలి. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మధుకర్ ను పదవి నుంచి తప్పించాలి అని అన్నారు. చూడాలి మరి ఈ వ్యాఖ్యల పై పుట్టా మధుకర్ ఎలా స్పందిస్తాడు అనేది.

Related posts