telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బీజేపీ ఆరోపణలకు గురుమూర్తి  ఆధారాలు…

ఏపీలో వరుస ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కడ అందరి దృష్టి తిరుపతి ఎన్నికలపైనే ఉంది. తాజాగా వైసీపీ అభ్యర్థి హిందువు కాదంటు బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవధర్ ట్విట్టర్లో ఆరోపణలు చేసిన నేపథ్యంలో..తాను హిందువేనంటు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి  ఆధారాలు విడుదల చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసి స్వామివారిని దర్శించుకున్న వీడియోను విడుదల చేసిన గురుమూర్తి నామినేషన్ దాఖలు చేసే ముందు కూడా తమ గ్రామ దేవతకు పూజలు నిర్వహించిన ఫోటోలు సైతం విడుదల చేసారు. 10 ఓట్ల కోసం బిజేపి చిల్లర రాజకీయాలు చేస్తోందని గురుమూర్తి ఆరోపించారు. తను ముమ్మాటికీ హిందువునేనని గురుమూర్తి అంటున్నారు. అయితే చూడాలి మరి దీని పై మళ్ళీ బీజేపీ నాయకులూ ఎలా స్పందిస్తారు అనేది.

Related posts