ఆఖండ సినిమా తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ చిత్రీకరణ జరుపుకుంటోంది.
బాలయ్యకు జంటగా శృతిహాషన్ నటిస్తున్న ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ చిత్ర బృందం ఎన్బీకే 107 చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకుంది.
ఈ పోస్టర్లో ..టెంపుల్ బ్యాక్ డ్రాప్లో రక్తంతో నిండిన కత్తిపట్టుకున్న బాలకృష్ణ ఉగ్రరూపంలో కనిపిస్తున్నఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేస్తోంది.
రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు వెనుక చంద్రబాబు హస్తం: మంత్రి పెద్దిరెడ్డి