telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వైకాపా ప్రభుత్వం జేసీబి ప్రభుత్వం…

Lokesh Tdp

మాజీ ఎమ్యెల్యే పల్లా శ్రీనివాస్ కు చెందిన బిల్డింగ్ కూల్చేసిన ఈ ఘటన పై నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ప్రజల ప్రాణాలు గాలికొదిలి ప్రతిపక్ష నేతల భవనాలు కూల్చే పనిలో బిజీగా ఉన్నారు జగన్ రెడ్డి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి, కార్మికుల పక్షాన నిలిచినందుకే టిడిపి నేత పల్లా శ్రీనివాస్ గారి పై సిఎం జగన్  కక్షపూరిత చర్యలకు దిగారు. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలని ప్లాన్ చేసిన జగన్ రెడ్డికి అడ్డొచ్చారు అనే అక్కసుతోనే ఆదివారం పూట పల్లా గారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అందుకే ఈ వైకాపా ప్రభుత్వాన్ని జేసీబి ప్రభుత్వం అన్నది. కనీసం నోటీసు ఇవ్వకుండా,చట్టాన్ని తుంగలో తొక్కి యుద్ధవాతావరణంలో భవనాన్ని కూల్చివేయడాన్ని, కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ జేసిబి ఊపులకు భయపడే వాడు ఎవడూ లేడు జగన్ రెడ్డి.” అంటూ లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చూడాలి మరి దీని పై వైసీపీ నుండి ఎటువంటి స్పందన వస్తుంది అనేది.

Related posts