telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : అర్ధశతకాలతో రాణించిన రానా, రాహుల్

ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ తీసుకోవడంతో ఎంపోదట బ్యాటింగ్ చేసింది కోల్‌కత. అయితే కేకేఆర్ జట్టులో ఓపెనర్ నితీష్ రానా(80), రాహుల్ త్రిపాఠి(53) అర్ధశతకాలతో రెచ్చిపోయారు. ఆ తర్వాత చివర్లో దినేష్ కార్తీక్ 9 బంతుల్లో 22 పరుగులతో రాణించడంతో నైట్ రైడర్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలవాలంటే 20 ఓవర్లలో 188 పరుగులు చేయాలి. అయితే హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగానే కనిపిస్తుంది. చూడాలి మరి ఈ టార్గెట్ ను వాళ్ళు చేధించగలరా… లేదా అనేది.

Related posts