ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది. ఆళ్లగడ్డ పీఎస్ లో భార్గవ్ పై ఇప్పటికే రెండు కేసులు ఉండగా, ఆయన అరెస్టు నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో భార్గవ్ ను వెతుక్కుంటూ ఆళ్లగడ్డ ఎస్సై రమేశ్ బృందం హైదరాబాద్ వచ్చారు. కారులో వెళుతున్న భార్గవ్ రామ్ ను చూసిన ఎస్సై రమేశ్ ఆ కారును నిలువరించేందుకు ప్రయత్నించారు.
అయితే భార్గవ్ రామ్ తన కారును ఆపినట్టే ఆపి దూకుడుగా ముందుకు ఉరికించడంతో ఎస్సై రమేశ్ బృందం ప్రమాదం నుంచి తప్పించుకుంది. అనంతరం భార్గవ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో తనపైనే దాడికి యత్నించాడంటూ ఆ ఎస్సై గచ్చిబౌలి పోలీసులకు భార్గవ్ రామ్ పై ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న తమకు ఆటంకం కలిగించారని అఖిలప్రియ భర్తపై ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఫిర్యాదుతో అఖిలప్రియ భర్తపై సెక్షన్ 353, 336 కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
ఆదాయానిచ్చే హైదరాబాద్ ఏపీకి లేకుండా పోయింది: జగన్