విశాఖపట్నం: విశాఖ కోర్టుకు హాజరైన మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తాను అనని మాటలను అన్నానని, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు వార్తలను ప్రచురించారన్నారు.
అధికార వైకాపా పార్టీకి చెందిన సాక్షి తో పాటు మరో రెండు పత్రికలకు నోటీసులిచ్చామన్నారు. తప్పు జరిగిందని తనకు లేఖలు కూడా రాశారన్నారు.
ఇటీవల తనపై అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసారంటూ విశాఖ జిల్లా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తప్పుడు రాతలు రాసిన సాక్షినుండి పరువు నష్టం కింద రూ.75కోట్లు డెక్కన్ క్రానికల్పై 25కోట్ల ఇప్పించాలంటూ లోకేష్ దావా వేసారు.
ఈ కేసు ఇవాళ విచారణకు రానున్న నేపథ్యంలో స్వయంగా కోర్టుకు హాజరయ్యేందుకు లోకేష్ విశాఖకు చేరుకున్నారు. ఇలా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తో పాటుటీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.