telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చనిపోయి 40 రోజులైనా డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ సీఎంకు లేఖ

చనిపోయి 40 రోజులైనా డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ సీఎంకు లేఖ రాసింది ఓ చిన్నారి. ఏపీలో ఓ 15 ఏళ్ల బాలిక సీఎం జగన్ కు లేఖ రాసింది. మా అమ్మ చనిపోయి 40 రోజులైంది. కానీ ఇంకా డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ లేఖలో తెలిపింది. మేన మామ ఆర్షిత్ రెడ్డి సహాయంతో డెత్ సర్టిఫికెట్ కోసం లేఖ రాసింది.లేఖలో ముఖ్యమైన ”పంచాయతీ సెక్రెటరీ కి అర్జీ పెట్టుకుంటే మీ అమ్మ నెల్లూరులో చనిపోయింది నేను డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేను అని సమాధానం చెప్పారు. పురపాలక సంఘం నుంచి డెత్ సర్టిఫికెట్ రావాలని ఒక్కసారి చెబుతారు. మరోసారి డాక్టర్ డెత్ సర్టిఫికెట్ పంచాయతీ కార్యాలయానికి వచ్చే వరకు ఆగాలని చెబుతారు. నా తల్లి అనుపమ డెత్ సర్టిఫికెట్ మంజూరు చేసి నా భవిష్యత్తుకు సహకరించాలని అని ఆ లేఖ ముగించారు. అయితే చూడాలి మరి దీని పై సీఎం జగన్ స్పందిస్తారా అనేది.

Related posts