telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అప్పటి కాలనీ గుర్తు చేస్తున్న విరాట పర్వం టీజర్…

దగ్గుపాటి రానా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాట పర్వం. సినిమాను నక్సలైట్ రవన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో రానా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో సీనియర్ నటి టబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఈ మధ్యే ‘కోలు  కోలు’ అంటూ సాగె ఓ పాట లిరికల్ వీడియోను విడుల చేసారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ టీజర్ ను విడుదల చేసారు. అయితే ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కతోంది. ఇక నక్సల్ నాయకుడు రవి అన్న పాత్రలో కనిపించిన రానా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. రానా కవిత్వం తో మొదలవుతున్న ఈ టీజర్ సాయి పల్లవి మ్యూట్ పదాలతో ముగుస్తుంది. అయితే ఈ సినిమా పై ఇప్పటికే ఉన్న అంచనాలను ఈ టీజర్ తారాస్థాయికి తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. చూడాలి మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా.. లేదా అనేది.

Related posts