telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్ నిమ్స్ లో వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం!

Corona Virus Vaccine

హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో లో భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు మొత్తం 60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 50 మందిని ఎంచుకుని వ్యాక్సిన్ టీకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి డోస్ ఇచ్చిన 14 రోజుల తరువాత అదే కోడ్ కు చెందిన బూస్టర్ డోస్ ను ఇచ్చామని, ఆ ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయిందని వైద్యాధికారులు తెలిపారు.

నిమ్స్ సంచాలకులు డాక్టర్ కే మనోహర్ నేతృత్వంలోని క్లినికల్ ఫార్మకాలజీ విభాగం, పలువురు ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులతో పాటు రెస్పిరేటరీ, అనస్తీషియా, జనరల్ మెడిసిన్ విభాగాల డాక్టర్లు ఈ ట్రయల్స్ నిర్వహణలో పాలుపంచుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీలర్లందరూ ప్రస్తుతం తమతమ ఇళ్లలోనే ఉండగా, వారందరినీ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇక 28 రోజుల తరువాత రెండవ మోతాదు టీకాను ఇచ్చేందుకు నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ విభాగం అధికారి డాక్టర్ సీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts