telugu navyamedia
క్రీడలు వార్తలు

రాబోయే ఐపీఎల్ ధోనీకి చాలా కీలకం: కోచ్ రవిశాస్త్రి

ravi shastri coach

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇకపై ఆటకు పూర్తిగా దూరంకానున్నారనే సందేహాలు వెలువడుతున్నాయి. తాజాగా జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తాను ధోనీతో మాట్లాడానని, ఆ విషయాలను ఇతరులతో పంచుకోలేనని శాస్త్రి పేర్కొన్నారు. త్వరలోనే ధోనీ వన్డేలకూ వీడ్కోలు పలికే అవకాశం ఉందని శాస్త్రి వ్యాఖ్యానించారు.

రాబోయే ఐపీఎల్ ధోనీకి చాలా కీలకమని, ఈ పోటీల్లో రాణిస్తేనే వరల్డ్ కప్ టీ-20లో ఆడే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఫిట్ నెస్ విషయంలో కపిల్ దేవ్ తో మహీని పోల్చిన రవిశాస్త్రి, జట్టుకు అతను భారం మాత్రం కాదని అన్నారు. ఇక టెస్ట్ మ్యాచ్ లను నాలుగు రోజులకు కుదించాలంటూ ఐసీసీ నుంచి వచ్చిన ప్రతిపాదన ఓ మతిలేని చర్య అని పేర్కొన్నారు. 

Related posts