telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎంఐఎం బహిరంగ సభ..పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

traffic diverted due to ramzan

ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ నేడు హైదరాబాద్‌ లో ఎంఐఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. మీరాలం ఈద్గా నుంచి శాస్త్రీపురం వరకు ముస్లిం సంఘాలు ర్యాలీలో పాల్గొననున్నాయి. ఈ ర్యాలీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

జడ్చర్ల నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలను ఆరాంఘర్‌ వద్ద దారి మళ్లించనున్నారు. ఆరాంఘర్‌ నుంచి చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం మీదుగా వాహనాలను మళ్లిస్తారు. హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వైపు వెళ్లే వాహనాలను మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట మీదుగా వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Related posts