తెలంగాణ లో ఖాళీ ఏర్పడిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారయ్యారు.టీఆర్ఎస్ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్రావు పేరునుటీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్రెడ్డి, నవీన్రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామి ఇచ్చారు. హామీ మేరకు ప్రస్తుతం ఒకే స్థానానాకి ఖాళీ ఏర్పడటంతో నవీన్రావుకు అవకాశం కల్పించారు. త్వరలో ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో గుత్తా సుఖేందర్రెడ్డికి అవకాశం కల్పిస్తామని సీఎం తెలిపారు.
previous post