telugu navyamedia
సినిమా వార్తలు

బీసీసీఐపై అమితాబ్ వ్యంగ్యాస్త్రాలు

Amitab Bachchan Tweet on RGV

12వ ప్రపంచకప్ ఫైనల్స్ లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగాయి. ఈ ఫైనల్లో ఇరు జట్ల స్కోర్లు సమంగా ఉండడంతో… ఫలితం తేల్చడం కోసం సూపర్ ఓవర్ నిర్వహించగా… అది కూడా టైగానే ముగిసింది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎక్కువ బౌండ్రీలు కొట్టిందని తేలడంతో ఇంగ్లండ్‌ నే విజేతగా ప్రకటించారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ బీసీసీఐపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ విషయంపై అమితాబ్ స్పందిస్తూ “మీ ద‌గ్గ‌ర రెండు వేల రూపాయ‌లు ఉంటే, నా ద‌గ్గ‌ర 2000 రూపాయ‌లు ఉన్నాయి. మీ ద‌గ్గ‌ర రెండు వేల రూపాయ‌ల నోటు ఒక‌టి ఉంటే, నా ద‌గ్గ‌ర 500 రూపాయ‌ల నోట్లు నాలుగు ఉన్నాయి. మ‌రి ఎవ‌రు ధ‌న‌వంతులు అంటే ??? ఐదు వంద‌ల నోట్లు నాలుగు ఉన్నోడే గొప్పోడు అని ఐసీసీ అంటుంది” అని మెగాస్టార్ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇక కొద్ది సేప‌టి క్రితం పీయూష్ పాండే ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ పెట్టిన హెడ్ లైన్‌ని నాకు ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ విజ‌యం ఓవ‌ర్‌త్రోతో సాధ్య‌మైందని త‌న ట్వీట్‌లో తెలిపారంటూ బిగ్ బీ పేర్కొన్నాడు ఈ నిబంధ‌న‌పై క్రీడా విశ్లేష‌కులు, అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఫైర్ అవుతున్నారు.

Related posts