తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా చిత్రం లాభం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, సాయి ధన్సిక ఓ కీలకమైన కీలక పాత్ర పోషించింది.
ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కూడా కరోనా వల్ల లేట్ అయింది. ఇక ఇటీవలే ఈసినిమా పోస్టర్లు అందరిని ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే యువకునిగా కనిపించనున్నాడు. మార్కెట్కు వచ్చేటప్పుడు అందులో లాభం అనేది కలుస్తుంది. అదే నిలువు దోపిడీగా మారుతుంది. అక్కడే రెండు వర్గాలుగా చీలుతుంది… అంటూ విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.
ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) నిర్మించారు. ఈసినిమాను కూాడా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదలవుతోంది.