telugu navyamedia
రాజకీయ వార్తలు

ప‌రువున‌ష్టం కేసులో సీఎం కేజ్రీవాల్‌ కు బెయిల్

Kejriwal AAP MLA Baldev Singh Resign

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాల‌కు ప‌రువున‌ష్టం కేసులో ఊర‌ట ల‌భించింది. ఢిల్లీలోని ప్ర‌త్యేక కోర్టు ఆ ఇద్ద‌రికీ బెయిల్ మంజూరీ చేసింది. బీజేపీ నేత విజింద‌ర్ గుప్తా వీరిపై ఈ కేసును దాఖ‌లు చేశారు. ఇరువురికీ చెరో 10 వేల రూపాయాల బాండ్‌పై బెయిల్‌ ఇచ్చారు. జూలై 25వ తేదీన ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు.

ఇద్ద‌రు నేతలు న‌ష్ట‌ప‌రిహారం కింద కోటి రూపాయ‌లు ఇవ్వాలంటూ గుప్తా త‌న పిటిష‌న్‌లో డిమాండ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో విజింద‌ర్ గుప్తాపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. త‌న‌పై హ‌త్యాయ‌త్నం చేసేందుకు గుప్తా ప్ర‌య‌త్నించిన‌ట్లు కేజ్రీ వాల్‌ ఆరోపించారు. దీన్ని సీరియ‌స్‌గా పరిగణించిన బీజేపీ నేత‌ విజింద‌ర్ గుప్తా కోర్టులో ప‌రువున‌ష్టం కేసు దాఖ‌లు చేశారు.

Related posts