telugu navyamedia
క్రీడలు

మళ్ళీ గెలిపించిన మహిళా జట్టు, బ్యాటింగ్ ఎంచుకున్న పురుష జట్టు..  

barat-newzeland t20 match from today
భారత్-న్యూజిలాండ్ మధ్య ఆక్లండ్ లో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో భారత్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలనే పట్టుడలతో టీమిండియా ఉంది. మరోవైపు, ఈమ్యాచ్ ను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని కివీస్ ఉవ్విళ్లురుతోంది. టాస్ ఓడిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలని తాము అనుకున్నామని చెప్పాడు.
టీమిండియా జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, దినేష్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్.
న్యూజిలాండ్ జట్టు: సీఫ్రెట్, మన్రో, విలియంసన్, మిచెల్, టేలర్, గ్రాండ్ హోమ్, శాంట్నర్, కుగ్లీన్, సౌథీ, సోధీ, ఫెర్య్గూసన్.
తాజా సమాచారం ప్రకారం 4ఓవర్లలో 20 పరుగులు చేసి, ఒక వికెట్ కోల్పోయింది.  ఇక మహిళా క్రికెట్ లో కివీస్ రెండో టీ కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. పురుషుల మ్యాచ్ ఏమవుతుందో చూడాలి.

Related posts