మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చునని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు.శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఏపీ ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని గుత్తా పేర్కొన్నారు.
చంద్రబాబు దుష్టపాలనకు రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారని సర్వేలు చెబుతున్న విషయాన్ని గుత్తా గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ సమాన దూరం పాటిస్తుందని గుత్తా స్పష్టం చేశారు.