telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కరోనా బారిన పడిన సచిన్ టెండూల్కర్…

Sachin tendulkar

గత ఏడాది నుండి కరోనా మన దేశాన్ని వణికిస్తూనే ఉంది. అయితే ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేసులు తగ్గుతాయి అనుకున్నారు. అలాగే మొదట్లో కేసులు తగ్గిన ఇప్పుడు మళ్ళీ భారీగా నమోదవుతున్నాయి. ఈరోజు అయితే ఏకంగా 60 వేలకు పైగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే మన దేశంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు, రాజకీయనాకులు ఈ కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా భారత క్రికెట్ దిగ్గజం లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్వయంగా ప్రకటించాడు సచిన్. అయితే సచిన్ ఫ్యామిలీ మెంబర్స్ కు కరోనా నెగెటివ్ వచ్చింది. ఇక ప్రస్తుతం సచిన్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. అయితే ఈ మధ్యే రోడ్ సేఫ్టీ టోర్నమెట్ లో పాల్గొన సచిన్ భారత లెజెండ్స్ న్యాయకత్వం వహించి జట్టుకు టైటిల్ అందించాడు.

Related posts