మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కోవిడ్ బులెటిన్లో గత 24 గంటల్లో కొత్తగా 36,902 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 112 మంది కరోనాతో మృతిచెందారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 26,37,735కు చేరుకోగా.. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 53,907 మంది కరోనాతో మృతిచెందారు.. ఇక, ఆ రాష్ట్ర రాజధానిలో ముంబైలో ఒకేరోజు అత్యధికంగా 5,513 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 17,019 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు రికవరీ అయినవారి సంఖ్య 23,00,056కు పెరిగింది.. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,82,451 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. కాగా, కరోనా కట్టడికి చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఓవైపు వ్యాక్సినేషన్ కొనసాగిస్తూనే.. మరోవైపు.. కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించింది.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. అయితే కేవలం మహారాష్ట్రలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
previous post
అలీ తాజా వ్యాఖ్యలతో వైసీపీలో అసంతృప్తి!