నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ లాక్డౌన్ వేళ ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయాన్ని అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్న ఈమె.. తాజాగా మహిళలపై జరుగుతున్న గృహ హింస దాడులపై స్పందించింది. మహిలు దీనిపై సమిష్టిగా యుద్ధం చేయాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ మేరకు ఓ ఫోటో పోస్ట్ చేస్తూ మహిళలంతా తన లాగే ఫోటో పోస్ట్ చేస్తూ నిరసన తెలపాలని కోరింది. ”ఈ లాక్డౌన్ పీరియడ్లో మహిళలపై గృహ హింస దాడులు పెరగడం అందరం చూసాం. ఇది రోజురోజుకు శృతిమించిపోతోంది. దీనిపై మౌనంగా ఉండటం సరికాదు. . దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి. బాధితురాళ్లను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. అంతా కలిసి ఓ రిపోర్ట్ రెడీ చేయాలి. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయాలంటే 181 లేదా జాతీయ మహిళా కమిషన్ నెంబర్ 7217735372కు వాట్సప్ చేయండి. అలాగే #ActAgainstAbuse ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలిపేందుకు నోరు, కళ్లు, చెవులు మూసుకుని ఉన్న ఫోటోను ఈ హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేయండి” అని పేర్కొంటూ ట్వీట్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘క్రాక్’ చిత్రంలో నటిస్తోంది.
previous post
next post
విడాకులు తీసుకోవటం వలన బతికిపోయా… భార్యపై సంపత్ కామెంట్స్