ఉద్యోగులకు రాజకీయాలతో సంబంధం లేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏ పార్టీకి అనుకూలంగా లేమని అన్నారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి అంతర్గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని తెలిపారు.
తప్పనిసరి పరిస్థితుల్లో తాము కూడా పిటిషన్లలో ఇంప్లీడ్ అవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఉద్యోగులను పిటిషన్ లో భాగం చేయడం సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు. అయితే, అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టుకు వాస్తవాలతో కూడిన జవాబు ఇచ్చామని వెల్లడించారు.