ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో కేంద్ర హోంశాఖ మార్పులు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది. అజెండాలో మార్పులు చేస్తూ తాజాగా మరో సర్య్కూలర్ జారీ చేసింది.
త్రిసభ్య కమిటీలో చర్చించాల్సిన 9 అంశాల నుంచి కేవలం అయిదు అంశాలకే పరిమితం ఎజెండాను పరిమితం చేస్తూ ఈ వేళ సాయంత్రం కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తొలుత ప్రత్యేక హోదాతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు, పన్ను రాయితీల అంశాన్ని చేర్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అపరిష్కృత అంశాలకు మాత్రమే పరిమితమని జీవీఎల్కు హోం శాఖ స్పష్టం చేసింది
ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కేంద్రం ఫోకస్ చేస్తోంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కొక్కరు కమిటీలో ఉంటారు.
యురేనియం తవ్వకాల పై స్పందించిన అఖిలప్రియ