ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధిపరచాలనే ఆకాంక్షతోనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కేబినెట్ మీటింగ్ కు వెళ్లేముందు మీడియాతో ఆయన మాట్లాడుతూ . రాజధానికి భూములను ఇచ్చిన రైతులనే కాకుండా ఇక్కడున్న అందరినీ సంతృప్తిపరచాల్సి ఉందని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు పారిపాల విధానమే తెలియదని ఎద్దేవా చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే జగన్ సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. మరోవైపు, రాజధాని ప్రాంత రైతులు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు.ఈ క్రమంలో ఓ మీడియా ఓబీ వ్యాన్ ను కూడా ధ్వంసం చేశారు. రైతులకు విపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి.