telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమే: జగన్

YS Jagan Files Nomination Pulivendul

ఏపీలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.ఏపీలో పోలింగ్‌ ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డితో కలిసి హైదరాబాద్‌ లోట్‌సపాండ్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ గెలుస్తుందని, తన ప్రమాణ స్వీకారం తేదీని దేవుడే నిర్ణయిస్తాడని అన్నారు.

ఈ ఎన్నికల్లో తమకు 140 అసెంబ్లీ స్థానాలు, 20 ఎంపీ స్థానాలు వస్తాయని జగన్‌ సోదరి షర్మిల చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే ఉద్యమం బతికి ఉందంటే దానికి జగనే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌తో దోస్తీపై ఎన్నిసార్లు చెప్పాలని జగన్ మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్న వేశారు. ఆ విషయంలో తిరుపతి సభలోనే తాను స్పష్టమైన ముగింపు ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు.

Related posts