telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చిరు వ్యాపారులకు ప్రభుత్వం రుణాలు: మంత్రి హరీశ్ రావు

Harish Rao trs

చిరు వ్యాపారులకు ప్రభుత్వం రుణాలను అందజేస్తోందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రుణాలను సద్వినియోగం చేసుకొని తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలోని గజ్వేల్ ఐవోసీలో పట్టణంలోని 853 మంది పట్టణ చిరు, వీధి వ్యాపారులకు రూ. 85 లక్షల విలువైన రుణాలను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా క్లిష్ట సమయంలో చిరు వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు.

చేతిలో చిల్లి గవ్వ లేక ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకొని జీవనం కొనాగిస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపార కూడలి గా ఉన్న గజ్వేల్ లాంటి పట్టణంలో చిరు వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారి దుస్థితి ని గుర్తించి ప్రభుత్వం కరోనా కాలంలో అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు .

Related posts