telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

2029 భూమి అంతం ఖాయమంటున్న … ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్…

tesla president on asteroid collision with earth

ఓ భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకువస్తోందని సరికొత్త ఆవిష్కరణల కోసం నిత్యం తపించే ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్ హెచ్చరించారు. ఆ రాకాసి గ్రహశకలం బ్రహ్మాండమైన శక్తితో భూమిని తాకుతుందని, దీన్నించి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యంకాదని, ఆత్మరక్షణ అసాధ్యమని అన్నారు. దీనిపేరు ‘అపోఫిస్’ అని తెలిపిన ఎలాన్ మస్క్ ప్రస్తుతం ఈ గ్రహశకలం భూమి ఉపరితలానికి 31 వేల కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు.

ఈజిప్టు పురాణాల ప్రకారం ఈ గ్రహశకలం పేరు చాలా గొప్పదని, పేరు సంగతి పక్కనబెడితే దాన్నుంచి ఎదురయ్యే ముప్పు అపారమైనదని వివరించారు. 1100 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గ్రహశకలం భూమిని చేరేది 2029 ఏప్రిల్ 13న అని చెప్పారు. ఎలాన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ సంస్థను స్థాపించి రోదసిపై తన ఆసక్తిమేరకు ప్రయోగాలు నిర్వహిస్తుంటారు. ఇప్పటికే ‘స్పేస్ ఎక్స్’ ద్వారా పలు అంతరిక్ష నౌకలను ప్రయోగించారు.

Related posts