telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీటీడీ ఆస్తుల వేలానికెళ్తే.. మళ్లీ కోర్టులకు వెళ్లొచ్చు: టీజీ వెంకటేశ్

TG Venkatesh MP

శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ నిర్ణయించినట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేవాలయ ఆస్తులను వేలం వేయడం కుదిరే పని కాదని అన్నారు. ఈ మేరకు కోర్టుల నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఒకవేళ వేలం వేసేందుకు ముందుకు వెళ్తే, మళ్లీ కోర్టులను ఆశ్రయించవచ్చని అన్నారు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరిగే పనిని ప్రభుత్వం మానేయాలని హితవు పలికారు.

పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై టీజీ ప్రస్తావిస్తూ ఈ జీవోను తెలంగాణ నేతలు వ్యతిరేకించడం సరికాదని చెప్పారు. పోతిరెడ్డిపాడు వల్ల ఎవరికీ నష్టం లేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు దాన్ని అడ్డుకోవడం మంచిది కాదని అన్నారు. రాయలసీమకు మంచి చేసే వాటిని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts