telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

venkaiah Naidu

కరోనా నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోలుకున్నారు. ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడీకి, ఆయన సతిమణికి ఎయిమ్స్ వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. అయితే ఈ పరీక్షల్లో వారికి కరోనా నెగిటివ్ వచ్చింది. సెప్టెంబర్ 29 న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా నుంచి కోలుకున్న వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. “కరోనా సంక్రమణ అనంతరం వైద్యుల సూచనమేరకు నా స్వీయనిర్బంధ కాలం పూర్తయింది. ఈ రోజు ఎయిమ్స్ బృందం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. అయినప్పటికీ వైద్యులు సూచించిన జాగ్రత్తలు మరికొంతకాలం కొనసాగించడం మంచిదని భావిస్తున్నాను. స్వీయనిర్బంధంలో ఉన్న సమయంలో ఎంతో మంది నా ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తరాలు, మెయిల్స్, మెసేజ్ ల ద్వారా వాకబు చేశారు. అన్ని ప్రాంతాలు, పార్టీలు, మతాలకు అతీతంగా నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, అనేక మంది ప్రార్థనలు చేశారు. వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. కరోనా సంక్రమణ సమయంలో నాకు అవసరమైన ఆరోగ్య సేవలందించిన వైద్యులు, ఇతర వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు. నాకు తోడుగా అన్నివేళలా సేవలు అందించిన నా వ్యక్తిగత సహాయకులకు ధన్యవాదాలు.” అంటూ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Related posts