telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వచ్చే ఎన్నికల్లో మా మద్దతు వారికే : సి.పి.ఐ ప్రధాన కార్యదర్శి

వచ్చే ఎన్నికల్లో తమ మద్దతి ఏ పార్టీకో చెప్పేసారు సి.పి.ఐ ప్రధాన కార్యదర్శి నారాయణ. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని విభజన చేప్పట్టిన తర్వాత మొదలైన అమరావతి ఉద్యమం ఈ రోజుతో 300 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ…  వచ్చే ఎన్నికల్లో అమరావతి, ప్రత్యేక హోదా మద్దతు ప్రకటించిన వారికే తమ మద్దతు ఉంటుంది అని చెప్పారు. కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారు. అయితే వాటన్నిటిని సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమించి ప్రజలకు ఇస్తాం. చేతనైతే అడ్డుకోవాలని నారాయణ సవాల్ చేసారు. కేవలం రాజధాని వచ్చినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందదు. పరిశ్రమలు, విద్యా రంగ సంస్థలు వస్తేనే అభివృద్ధి చెందుతుంది. 300 రోజులు నిద్రాహారాలు మాని ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లు అని  మంత్రి బొత్స సత్యనారాయణ అనటం సిగ్గు చేటు అని అన్నారు. ఇసుక అమ్ముకోవడం, దళిత భూములు లాక్కోవటం, దాడులకు దిగడం జగన్ ప్రభుత్వానికి ప్రధాన అజెండాగా మారింది అని నారాయణ చెప్పుకొచ్చారు

Related posts