ఢిల్లీ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తాజాగా, ఆమె మోడీని పొగిడారు. తన ప్రభుత్వ ప్రధానిని తక్కువ చేసి మాట్లాడారు. రక్షణ వ్యవస్థలో నిర్ణయాలు మన్మోహన్ కంటే మోడీనే చక్కగా తీసుకోగలరని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడటంలేదు. ఒకపక్క ఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్ అధిష్టానం నానా తిప్పలు పడుతుంటే, మరో పక్క వాళ్ళ నేతలతోనే వారికి చిక్కులు ఎదురవటం గమనార్హం.
ఒక జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో షీలా మాట్లాడుతూ, ఉగ్రవాదం విషయంలో మాజీ ప్రధాని మన్మోహన్ ఉదాసీన వైఖరి అవలంబిస్తారని; ఆయన కంటే మోడీనే సరైన నిర్ణయాలు తీసుకోగలరని అన్నారు. అయితే మోడీ రక్షణ విషయాలను కూడా రాజకీయం చేస్తుండటం ఆయనలో లోపం కావచ్చు అన్నారు. ఈ విషయాలను సదరు మీడియా ట్వీట్ ద్వారా సామజిక మాధ్యమాలలో విడుదల చేసింది.
ఇక ఆ ట్వీట్ కాస్తా వైరల్ అవడంతో, తన వ్యాఖ్యలను వక్రీకరించినట్టు షీలా మరో ట్వీట్ లో సందేశం ఇవ్వడం విశేషం. మోడీ ఉగ్రవాదాన్ని కూడా తన రాజకీయ ఎదుగుదలకు వాడుకుంటున్నారని తాను అన్నట్టు షీలా వివరణ ఇచ్చారు.
మెగాస్టార్, మంచు ఫ్యామిలీల మధ్యలో మనస్పర్థలు లేవు : మంచు విష్ణు