telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తామేమీ చీకటి జీవోలు ఇవ్వలేదు: మంత్రి వెల్లంపల్లి

srinivasa rao minister

మాన్సాస్ ట్రస్టు వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు.

ట్రస్టుపై ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని మంత్రి వెల్లంపల్లి ఉద్ఘాటించారు.మాన్సాస్ ట్రస్టు అంశంలో తాము చట్టబద్ధంగానే వ్యవహరించామని స్పష్టం చేశారు. తామేమీ చీకటి జీవోలు ఇవ్వలేదని తెలిపారు. అశోక్ గజపతిరాజు హయాంలో ట్రస్టులో అక్రమాలు జరిగాయని, చైర్మన్ గా ఉండి అక్రమాలకు పాల్పడినట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. విచారణ జరిపి అన్ని నిజాలు వెలికితీస్తామని చెప్పారు.

Related posts