telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రాజాసింగ్ కి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నినాదాలు…

Rajasingh Bjp MLA

జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఒక పక్క పార్టీలు ఎలాగైనా మేయర్ పీఠం సాధించాలి ప్రయత్నాలు చేస్తోంటే, సీటు తమకు దక్కలేదని కొందరు తమ పార్టీలోని ఇతర వర్గాలతో గొడవలు పడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోషామహల్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి అక్కడ బాహాబాహీకి దిగారు. రాజాసింగ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కుర్చీలు విరిసి కొట్టుకుంటున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఆ నియోజకవర్గంలో గన్ ఫౌండ్రీ డివిజన్ టికెట్ విషయంలో కార్యకర్తలు ఆందోళనకు దిగినట్లు చెబుతున్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బిజెపి అధిష్టానం గన్ ఫౌండ్రీ టికెట్ ఓం ప్రకాష్ కు ఖరారు చేసింది. అయితే ఆ బీఫామ్ తీసుకునేందుకు వచ్చిన ఓం ప్రకాష్ ని శైలేందర్ యాదవ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి. అయితే ఓం ప్రకాష్ ఇటీవల బీజేపీ లోకి వచ్చారు. తెలుగుదేశంలో ఇన్నాళ్లు ఉండి ఎన్నికల ముందు టీడీపీ లో నుంచి బీజేపీ లోకి వచ్చిన ఆయనకు టికెట్ ఎలా ఇస్తారని ఆయన వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. చూడాలి మరి ఈ వాగ్వధాలు ఎక్కడి వరకు వెళ్తాయి అనేది.

Related posts