వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ.. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని వరుణ్ చాలా మేకోవర్ అయ్యారు. ఫిబ్రవరి 24న సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. తొలి షెడ్యూల్ను వైజాగ్లో 15 రోజుల పాటు చిత్రీకరించాం. హీరోయిన్ సయీ మంజ్రేకర్తో పాటు నవీన్ చంద్ర, నదియాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. ఏప్రిల్ 3న కొత్త షెడ్యూల్ను హైదరాబాద్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఈ లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. జూలై 30న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం అన్నారు.
previous post